అది భ‌రించలేకే కెప్టెన్సీ వదిలేశా: విరాట్ కోహ్లీ

Date:

Share post:


విరాట్ కోహ్లీ కేవ‌లం క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు.. ఒక యువ ఐకాన్, ఫిట్‌నెస్ మోటివేటర్, స్టైల్ సింబల్. అలాగే మిలియన్ల అభిమానుల హృదయాల్లో రాజు కూడా. భారత క్రికెట్ జట్టులో ఒక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా విరాట్ ప్ర‌సిద్ధి చెందాడు. సచిన్ టెండూల్కర్, ఎమ్‌.ఎస్‌. ధోనీ త‌ర్వాత అంత‌టి క్రేజ్ సంపాదించుకున్న‌ది విరాట్ కోహ్లీనే అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా విరాట్ కెప్టెన్సీకి కూడా హ్యూజ్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఫిట్‌నెస్‌, స్థిరత, అగ్రెషన్‌కు ప్రాముఖ్యత ఇచ్చి అత‌ను జట్టుకు దిశానిర్దేశం చేసేవారు.

అయితే ప్ర‌స్తుతం విరాట్ ఇండియ‌న్ టీమ్ తో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్సీకి కూడా దూరంగా ఉంటున్నాడు. ఇందుకు గ‌ల కార‌ణాన్ని తాజాగా విరాట్ వివ‌రించాడు. ఐపీఎల్-2016 నుంచి ఐపీఎల్-2019 వరకు ఆర్సీబీకి బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించానని.. ఆ మూడేళ్లు ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్‌గా సక్సెస్ అవడంతో పాటు సారథిగానూ రాణించాలనే ప్రెజర్ తనపై చాలా అధికంగా ఉండేద‌ని, దాంతో ప్ర‌తి నిమిషం బ్యాట‌ర్‌గా, కెప్టెన్‌గా ఎలా స‌క్సెస్ అవ్వాలనే ఆలోచించేవాడ్ని అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు.

టీమిండియాతో పాటు ఆర్సీబీ టీమ్ విషయంలోనూ త‌న‌పై ఎక్స్‌పెక్టేషన్స్, ప్రెజర్ ఎక్కువవడంతో తీవ్ర ఒత్తిడికి లోన‌య్యాన‌ని.. ఆ ఒత్తిడిని భ‌రించ‌లేకే కెప్టెన్సీ వదిలేశాన‌ని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇప్పుడు కేవ‌లం బ్యాటర్‌గానే రాణించడం చాలా హ్యాపీగా ఉంద‌ని.. నెక్స్ట్ ఏం జరుగుతుందోననే టెన్షన్స్ లేకుండా జీవిస్తున్నాన‌ని విరాట్ పేర్కొన్నాడు. గేమ్‌లో ఎక్కువ రోజులు కొనసాగడానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...