అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ

Date:

Share post:


– Advertisement –

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 2.55 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని. ఏపీకి ప్రధాని వస్తున్న నేపథ్యంలో మొత్తం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్లలో సచివాలయం వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు మోదీ. హెలిప్యాడ్ వద్ద మోదీకి స్వాగతం పలకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

3.20 గంటలకు ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు మోదీ. 3.30 గంటల నుంచి 4.45 గంటల వరకు అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజా రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్నారు.

పైలాన్‌పై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వివిధ ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయి. వేదికపై 14 మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు హీరో చిరంజీవి, ఇతర ప్రముఖులు.

అనంతరం ఏర్పాటు చేసే బహిరంగసభ కార్యక్రమంలో 5 లక్షల మంది వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. కార్యక్రమానికి 5 లక్షల వరకు ప్రజలు హాజరవుతారని అంచనా . బహిరంగసభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వేసవి రీత్యా తాగునీరు, మజ్జిగ, ఆహారం అందించేలా చర్యలు తీసుకున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...