అమరావతి కట్టేనా?..లేక మళ్ళీ మట్టేనా? – Adya News Telugu

Date:

Share post:


– Advertisement –

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు మోడీ. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలా… ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు.

ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? అని ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారు..
ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం అన్నారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలి.10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో మోడీ అడుగు పెట్టాలి… మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలి. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అన్నారు. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలి. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి. ఈ ప్రకటన మోడీ గారు చేయాలి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు షర్మిల.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...