ఆపరేషన్ సింధూర్ కాకుండా మరేదో ప్లాన్ చేస్తున్నారా.. ఆయనతో మోడీ భేటీ అందుకేనా..?

Date:

Share post:


ప‌హ‌ల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ పాకిస్తాన్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంది. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా తీసుకుని వాటిని నేలమట్టం చేసింది. ఈ సంఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్ ప్రతిదాడికి దిగింది. మిస్సైల్ తో భారత ఆర్మీ పై దాడికి ప్రయత్నించింది. అయితే.. భారత్ ఈ సమస్యను పూర్తిగా ఏస్ 400 డిఫెన్స్ సిస్టం ద్వారా తిప్పికొట్టింది. ఇక గురువారం రాత్రివేళ 15 ఇండో నేవి స్థావరాలపై భారీ ఎత్తున క్షిప‌ణి, డ్రోన్ దాడులు నిర్వహించిన పాకిస్తాన్.. విఫలమైంది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోడీకి.. భారత్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర థ్రివేదితో జ‌రిగిన భేటి ఆశ‌క్తిగా మారింది.

Indo-Pak Wars Timeline: Armed Conflicts Since 1947

మోడికి.. ఉపేంద్రకు ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన భేటికి కారణమేంటి అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. వీళ్ళిద్దరూ కలవడానికి.. ఆపరేషన్ సింధూర్ కాకుండా.. మరేదో ప్లాన్ ఉండి ఉంటుందంటూ ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌ను పూర్తి చేయలేదని.. ఇంకా కొనసాగుతుందంటూ వెల్లడించారు. భారత్‌పై దాడికి ప్రయత్నిస్తున్న పాక్ దాడులు గట్టిగా తిప్పి కొడతామని.. వారికి సరైన సమాధానం చెప్పుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ తో ప్రధాని భేటి మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. భారత్, పాక్‌ సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులపై మోడీకి ఉపేంద్రకు మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక పాక్‌కు ధీటుగా ఎదుర్కొనేలా ఇండియన్ నేవీ నిర్ణయాలు తీసుకోనుందట. అయితే.. ఇండియన్ నేవీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది.. వీటి పరిణామాలు ఎలా ఉండనున్నాయి.. అనేది వేచి చూడాలి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...