టాలీవుడ్ ఇండస్ట్రీలోని మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్( Sharwanand ) కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకోగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.శర్వానంద్ గత సినిమా మనమే ప్రేక్షకులను మెప్పించే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది.
విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నా శర్వానంద్ కు కెరీర్ పరంగా కలిసిరావడం లేదు.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ( Sharwanand, Anupama Parameswaran )కాంబినేషన్ లో తెరకెక్కిన శతమానం భవతి హిట్ కాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
సంపత్ నంది డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.టిల్లూ స్క్వేర్ తో సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
సంపత్ నంది సైతం సీటీమార్ తర్వాత కొంత సమయం గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో శర్వానంద్ కచ్చితంగా హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
శర్వానంద్ పారితోషికం 10 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంగా ఉండనుందని సమాచారం అందుతోంది.

ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.శర్వానంద్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.శర్వానంద్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా సక్సెస్ సాధించడం శర్వానంద్ కెరీర్ కు కీలకం అనే సంగతి తెలిసిందే.శర్వానంద్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.
స్టార్ హీరో శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.