ఇంటర్ ఫెయిల్ కానీ సివిల్స్‌లో! – Adya News Telugu

Date:

Share post:


– Advertisement –

ఇంటర్ ఫెయిల్ కానీ సివిల్స్‌లో ర్యాంక్ సాధించి సత్తా చాటాడు తెలుగు విద్యార్థి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్‌ పదో తరగతి వరకు సాధారణ విద్యార్థి.. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయ్యాడు.

దీంతో ఎందుకు పనికి రాడని అందరూ అనుకున్నారు. కానీ సురేష్‌ మాత్రం తిరిగి నంద్యాలలో డిప్లొమా కోర్సులో చేరి, తర్వాత ఈసెట్‌ రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. కర్నూలులో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక.. 2011లో జెన్‌కోలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు.. కానీ సివిల్స్ సర్వీసెస్‌ రాయాలని, సత్తా చాటాలని అనుకున్నాడు.

2017లో తొలిసారి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయగా ప్రిలిమ్స్‌ పరీక్షలో కూడా ర్యాంక్ సాదించలేకపోయాడు. రెండో ప్రయత్నంలో ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.

దీనికి తోడు కొవిడ్‌ బారిన పడి వినికిడి సమస్య తలెత్తింది, అయినా పట్టు వదలలేదు .. సివిల్స్‌కు ఇబ్బందిగా ఉందని 2020లో నెలకు రూ.1.50 లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పట్టువదలకుండా ప్రయత్నిస్తూ 2024లో ఏడో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌లో 988వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...