ఈడీకి మహేశ్ బాబు రిక్వెస్ట్..ఒప్పుకుంటుందా?

Date:

Share post:


సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ, సురానా గ్రూప్ కంపెనీలకు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థల ప్రమోషన్ల కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్లు స్వీకరించారని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలాగా ప్రజలను మహేశ్ బాబు ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 27న విచారణకు హాజరు కావాలని ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

అయితే, నేడు ఈడీ విచారణకు హాజరు కాలేనని అధికారులకు మహేశ్ బాబు లేఖ రాశారు. ముందస్తుగా ఖరారైన సినిమా షూటింగ్ షెడ్యూల్ వల్ల విచారణకు రాలేనని, రేపు కూడా షూటింగ్ ఉందని లేఖలో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని ఈడీ అధికారులను కోరారు. మహేశ్ బాబు అభ్యర్థనపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...