పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు 14 మంది హతమైనట్లు తెలుస్తోంది. అందులో, మసూద్ అజహర్ సోదరి, బావ, వారి కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి మసూద్ అజహర్ కుటుంబం వార్నింగ్ ఇచ్చింది.
చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలున్నారని, మోదీ తమకెంతో నష్టం చేశారని మసూద్ కుటుంబ సభ్యులు అన్నారు. ఆ పిల్లలు అమరులయ్యారని, వారి త్యాగం వృథా కాదని చెప్పారు. వారి అమరత్వం భారత్ పతనానికి నాంది పలుకుతుందని హెచ్చరించారు. అయితే, ఉగ్రవాది మసూద్ ను మోదీ చావు దెబ్బ కొట్టినా బుద్ధి రాలేదని, ఇంకా వైఖరి మారలేదని నెటిజన్లు అంటున్నారు.

అయితే, తమకు పాక్ తో యుద్ధం చేయాలన్న ఉద్దేశ్యం లేదని, కానీ, పాక్ దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పాక్ తమను రెచ్చగొడితే అన్ని విధాలుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చారు. ఇక, పిక్ఛర్ అభీ బాకీ హై అంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ జస్ట్ టీజర్ మాత్రమే అని, ఇకనైనా పాక్ బుద్ధి తెచ్చుకోకుంటే ట్రైలర్ తో పాటు సినిమా చూపిస్తామని భారత్ హెచ్చరిస్తోంది.