ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల వేట జరుగుతూనే ఉంది. మొదటి విడత ఆపరేషన్లో పాక్తో పాటు పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలు అన్నింటినీ ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. 100 మంది ఉగ్రవాదులను భూస్థాపితం చేసేసింది. తర్వాత సరిహద్దు రాష్ట్రాల పైన డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలన్నింటినీ భారత్ స్ట్రాంగ్గా తిప్పి కొట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ లోను భారత్ పై ప్రయోగానికి స్థావరంగా వినియోగించుకుంటున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ను భారత్ ఆర్మీ నేలమట్టం చేసింది. తాజాగా.. ఈ వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేశారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల్లో కాల్పులే కాకుండా.. డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యాడు. మరోవైపు శ్రీ నగర్, పట్టణ కోట ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు భారీగా వినిపించాయి. పాక్ దాడులకు ప్రతికారంగా ఆ దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఇక పాక్ జరిపిన దాడుల్లో జమ్మూ కాశ్మీర్కు అడిషనల్ డిప్యూటీ కమిషనర్గా వ్యవహరిస్తున్న రాజ్ కుమార్ తప్తా మృతి చెందాడు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు.
రాజ్ కుమార్.. జిల్లా డెవలప్మెంట్ కమిషనర్గా బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనలో రాజ్ కుమార్ సహా 5గురు మృతి చెందడం బాధాకరం. పలువురికి గాయాలు కాగా.. అటు శ్రీనగర్లోను ఉదయం నుంచి భారీ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. జమ్మూ ప్రాంతంలో డ్రోన్లతో దాడి చేసేందుకు.. స్థావరలను వినియోగించుకుంటున్న లాంచ్ ప్యాడ్లను భారత్ నాశనం చేసేసింది. కాగా.. తాజాగా వీటి వీడియోలు రిలీజ్ అయి వైరల్ గా మారుతున్నాయి.
ఇక పాకిస్తాన్లోని 4 ఎయిర్ బేస్ లపై మన ఆర్మీ డ్రోన్ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ ఏడి రాడార్ను భారత డ్రోన్లు ద్వంశం చేశాయని ఇండియన్ ఫోర్స్ అధినేత ఖురేషి వెల్లడించారు. అంతేకాదు పాకిస్తాన్ సైనిక బలగాలు వస్తున్నట్లు ముందుగానే గమనించినట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తున్నారని పై ఫైరయ్యారు. భారత్లోని పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రచారం చేస్తుందని.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ మండిపడ్డారు. పాక్కు తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహ భారతాన్ని తిప్పి కొట్టింది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో ఏయిర్ లాంచర్లను భారత్ ధ్వంసం చేసినట్లు వివరించింది.
OPERATION SINDOOR
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan’s misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on… pic.twitter.com/2i5xa3K7uk
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025