ఎమ్మెల్యేకి తెలియకుండా అధికారులు రివ్యూ మీటింగులు.. ఏం జరుగుతోంది?

Date:

Share post:


పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడెం కూటమి నేతల్లో విభేదాలున్నాయా? తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వెనకున్న ఆంతర్యం ఏంటి? ఎమ్మెల్యే చనిపోవాలని కోరుకున్నది ఎవరు? జనసేన-టీడీపీ మధ్య మధ్య గ్యాప్ ఉందన్నది నిజమేనా? కూటమి నేతల మధ్య ఎదరవుతున్న సమస్యలేంటి? తాడేపల్లిగూడెం చరిత్ర లో ఎన్నడూ లేని అత్యధిక మెజారిటీతో గెలిచిన జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసును టెన్షన్ పెడుతున్న విషయాలేంటి? టిడిపి-జనసేన నేతల‌మధ్య అధికారులకు ఎదురవుతున్న సమస్యలేంటి? ఇంతకీ తాడేపల్లి కూటమిలో అసలేం జరుగుతోంది?

తాడేపల్లిగూడెంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాడేపల్లి గుడెం పట్టణంలో స్విమ్మింగ్ ఫూల్ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లి MLA బోలిశెట్టి శ్రీనివాస్..సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే కొంతమంది బై ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్యేగా నెగ్గాలని భావిస్తున్నట్లు స్వయంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగ సభలో ప్రస్తావించడంపై కూటమి నేతల్లో టెన్షన్ మొదలైందట. పేర్లు ప్రస్తావించకుండానే ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూటమి నేతలను కలవరపెడుతున్నాయట.

కూటమి ఎమ్మెల్యేగా తనను ప్రజలు గెలిపించుకున్నారని, ఎవరో త్యాగం చేస్తే తాను ఎమ్మెల్యే అవ్వలేదని ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. అయితే ఎమ్మెల్యే కామెంట్ల వెనుక జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ లో ఎటువంటి సమస్యలు వస్తాయని నేతలు టెన్షన్ పడుతున్నారట. సహచర నేతలు అనుసరిస్తున్న విధానాలపై ఆయన వ్యాఖ్యలు చేయడం వెనుక అర్దం ఏమై ఉంటుందనేదానిపై ఆరా తీస్తున్నారట. ఎమ్మెల్యే చేసిన కామెంట్లతో స్థానిక జనసేన-టీడీపీ నేతలు మధ్య రోజురోజుకు దూరం పెరిగిపోతుందా అన్న అనుమానాలు కూడా నేతలను వెంటాడుతున్నాయన్న టాక్ విన్పిస్తోంది.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేకి తెలియకుండా టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి తమ పనులు చేయాల్సిందేనని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరిస్తున్నారంట. అధికారులు ఇదే విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లడంతో టీడీపీ, జనసేన మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిర్గతం అయిందంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే సైతం అసహనం వ్యక్తం చేశారట.

Also Read: ఆ టాస్క్ విష‌యంలో మంత్రులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు?

టీడీపీ నేత తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపిస్తున్నారని, కనీసం తన పదవికి అయిన గౌరవం ఇవ్వడం లేదంటూ తన అనుచరుల దగ్గర ఎమ్మెల్యే బొలిశెట్టి వాపోయినట్లు సమాచారం. అయితే తప్పుగా అర్ధంచేసుకోవడంవల్లే కూటమినేతలు మధ్య దూరం పెరుగుతుందని కార్యకర్తలు భావిస్తున్నారట. ఎమ్మెల్యే బొలిశెట్టిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎవరనేది స్పష్టంగా చెప్పకపోవడంతో కూటమి నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి తలెత్తిందని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఏ పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తి
అయితే టీడీపీ ఇంచార్జీగా ఉన్న వలవల బాబ్జికి ఏడాది కావస్తున్నా ఏ పదవి ఇవ్వకపోవడంపై టిడిపి నేతల్లో కొంత అసంతృప్తి ఉందట. బాబ్జి తనకు పదవుల మీద ఆశ లేదంటూనే తనదైన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో ప్రయత్నాలు చేయటం ఇటు జనసేన నేతలకు కొంత ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి తన ఇంట్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం పెట్టడం ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు నచ్చలేదన్న టాక్ సైతం విన్పిస్తోంది.

మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుండి వచ్చే బలమైన నేతలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ నుండి జనసేనలోకి వలసలు పెరగడంతో వలవల బాబ్జి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. నియోజకవర్గంలో పైచేయి సాధించడం కోసం ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు బహిరంగ విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మొత్తమ్మీద పవన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతా ఒకటిగానే ఉన్నామని పైకి చెప్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంతో..కూటమి నేతల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయా అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

మా సహకారంతోనే గెలిచారని ఒకరు ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచామని ఎమ్మెల్యే నేతల వద్ద ఎవరికివారు చెప్పుకుంటున్నారు. అయితే అసలు ఈ రచ్చ అంతటికీ కారణం రాబోయే మున్సిపల్ ఎన్నికలే అన్న టాక్ సైతం జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఆ ఎన్నికల వాటాల్లో జనసేనపై పైచేయి సాధించేందుకే టీడీపీ నేతలు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటువైపు మల్లుతుందో అర్థంకాని పరిస్థితిగా తయారైందట.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...