ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ నేత పాక

Date:

Share post:


వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానం టీడీపీ లేదా జనసేన తరఫున ఒకరికి దక్కుతుందని పలు పేర్లు కూడా వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది. అయితే, అనూహ్యంగా ఆ స్థానం బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణకు దక్కింది.

పెద్ద‌ల స‌భ‌లో బీజేపీకి బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానం కావాలని బీజేపీ నాయ‌కులు కోరారు. ప్రధాని మోడీకి ఆ స్థానాన్ని సీఎం చంద్రబాబు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ పాకాకు టికెట్ వస్తుందని ఆశించినా నాగబాబుకు దక్కింది. శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తిని తొలిసారి బీజేపీ పెద్ద‌ల స‌భ‌కు పంపడం విశేషం.

అసలు రేసులో ఉన్నారని కూడా ఎవరూ అనుకోని పాక పేరు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. ప్రస్తుతం బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్న పాకాకు పదవి ఇప్పించాలని పురందేశ్వరి సిఫారసు చేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...