ఏబీవీకి భారీ ఊరట

Date:

Share post:


రిటైర్డ్ ఐపీఎస్, ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (ఏబీవీ)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీవీపై వైసీపీ హయాంలో నమోదైన కేసును, చార్జిషీట్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఏసీబీ మోపిన అభియోగాలకు ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు కొట్టివేస్తున్నామని కోర్టు వెల్లడించింది. దీంతో, ఏబీవీకి భారీ ఊరట లభించినట్లయింది.

భద్రత, నిఘా పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 2021 మార్చిలో ఏబీవీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ 2022లో ఏబీవీ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ తుది తీర్పు వెలువరించారు. పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఖర్చు చేయ లేదని, అనుచిత లబ్ధి పొందే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఏబీవీ తరఫు న్యాయవాది వాదించారు. ఏబీవీ కుమారుడికి చెందిన ‘ఆకాశ్ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌’ సంస్థకు, టెండర్‌ దక్కించుకున్న ఇజ్రాయెల్‌ సంస్థతో అనుబంధం లేదని ఇజ్రాయెల్‌ కంపెనీ స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...