ఒకే జైలులో పీఎస్ఆర్, వంశీ.. బుద్ధా సెటైరిక‌ల్ ట్వీట్!

Date:

Share post:


వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి నుంచి ఆయ‌న జైలు జీవితాన్నే గ‌డుపుతున్నారు. మ‌రోవైపు ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు పాల్ప‌డిన కేసులో ఏ2గా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇటీవ‌లె అరెస్ట్ అయ్యారు.

మంగళవారం హైదరాబాద్‌లోని నివాసంలో పీఎస్‌ఆర్ ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. బుధవారం విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌స్థానం ఆంజనేయులుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం ఆంజ‌నేయులు కూడా వంశీ ఉన్న జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వంశీ, ఆంజ‌నేయులు మ‌ధ్య‌ గతంలో వైరం న‌డిచింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, వంశీల‌ను ఒకే సెల్ లో ఉంచాలంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. జైలు సూపరింటెండెంట్ ను ఉద్దేశిస్తూ.. `విజయవాడ జైల్లో ఎవరైనా తోడు కావాలంటూ కోరుతున్న వంశీ, ఎక్కడ ఉన్నా పక్కన ఎవరో ఒకరు ఉండాలి పీఎస్సార్ ఆంజనేయులుకి.. కావున వీరిద్దరిని ఒకే సెల్ లో పెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు..` అంటూ బుద్ధా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...