కుమారుడిపై తల్లి దాష్టికం.. అంత దారుణంగా ఎలా

Date:

Share post:


ప్రపంచంలో ఏ బంధం ప్రేమతో నిండి ఉంటుందంటే, అది తల్లీ-పిల్లల బంధమే.తల్లి ప్రేమ అనేది నిరంతరం నిస్వార్థంగా, అపారంగా ఉండేది.

 Shocking Video Telangana Mother Brutally Beats 3 Year Old Son Sparks Outrage On-TeluguStop.com

ఒక తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేయగలదన్న భావన మనకు చిన్ననాటి నుంచే గుర్తింపుగా ఉంటుంది.కానీ, కొన్ని సందర్భాల్లో తల్లి చేతులే పిల్లల పైన హింసగా మారుతున్న ఘటనలు చూస్తే మాత్రం కలత చెందక తప్పదు.

తాజాగా తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల( Jagityal ) పట్టణంలో జరిగిన ఓ హింసాత్మక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.తులసినగర్ ప్రాంతానికి చెందిన శ్రీపెల్లి రమ( Sripelli Rama ) అనే మహిళ తన మూడేళ్ల కొడుకును అతి దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ దారుణం చూసిన వారు ఆ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీడియోలో ఆ తల్లి( Mother ) గత కొన్ని రోజులుగా, కొడుతుండడమే కాక.కాలితో తన్నుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.ఇలాంటి పరిస్థితులు ఆ చిన్నారి ప్రతిరోజూ ఎదుర్కొంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.

అయితే ఈ దృశ్యాలను పొరుగువారు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న సఖి సెంటర్( Sakhi Center ) అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.బాలుడిని తన పరిరక్షణకు తీసుకొని కేంద్రానికి తరలించారు.విచారణలో రమ భర్త ఆంజనేయులు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం.

కుటుంబంలో ఉన్న ఒత్తిడులు, మానసిక స్థితి తదితర కారణాలు ఈ హింసకు కారణమైనా, పిల్లల పట్ల తల్లులు తీసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో స్పందన వస్తోంది.

“తల్లి తన పిల్లాడిపై ఇటువంటి హింస ఎదుర్కొనడం బాధాకరం” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.శిశు హక్కుల పరిరక్షణ కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.





Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...