కూట‌మి స‌ఖ్య‌త‌పై… ప‌వ‌న్ ఆలోచ‌న‌ ఏంటి ..!

Date:

Share post:


“కూట‌మిలోని మూడు పార్టీలు.. క‌లిసే ఉన్నాయి. కూట‌మి పార్టీల నాయ‌కులు ముమ్మాటికీ క‌లిసే ప‌నిచే స్తున్నారు. ఈ విష‌యాన్ని నేను నొక్కి చెబుతున్నా. ముమ్మాటికీ.. కూట‌మి పార్టీలు క‌లిసే ఉంటాయి“ అని ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో ప‌ర్య‌టించిన ఆయ‌న .. కూట‌మి పార్టీల ఐక్య‌త‌, నాయ‌కుల స‌ఖ్య‌త‌పై ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. వాస్త‌వానికి ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న ఎందుకు చేశార‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

నిజానికి ఒక విష‌యాన్ని ప‌వ‌న్ వంటి నాయ‌కులు.. ప్ర‌స్తావించారంటేనే.. తెర‌వెనుక ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉండే ఉండాలి. సో.. దీనిని బ‌ట్టి కూట‌మిలో ఉన్న నాయ‌కుల మ‌ధ్య పొర‌పొచ్చాల వ్య‌వ‌హారంపై ఆయ‌న ప‌రోక్షంగా స్పందించారా? లేక‌.. నిజంగానే కూట‌మిలో స‌ఖ్య‌త ఉంద‌ని చెప్పుకొన్నారా? అంటే.. స‌ఖ్య‌త ఉంటే.. ఇలా ప‌దే ప‌దే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా.. ఆయ‌న ఎప్పుడూ.. క‌ట‌మి స‌ఖ్య‌త‌పై మాట్లాడ‌లేదు. పైగా.. అంద‌రూ క‌లిసి మెలిసి ఉన్నార‌న్న కోణంలోనే స్పందిస్తున్నారు.

దీనిని బ‌ట్టి ప‌వ‌న్ వంటి నాయ‌కులు మాట్లాడేప్పుడు కూడా.. ఇదే ఫార్ములాను అవ‌లంభించి ఉంటే బాగుండేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో చూస్తే.. తిరుప‌తి, పాల‌కొండ‌, ఉండి, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, తాడేప‌ల్లి గూడెం.. వంటి కీల‌క కూట‌మి పార్టీలు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. బ‌హిర్గ‌తం అవుతున్నాయి. ప‌లువురు నాయ‌కులు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగానే వాద ప్ర‌తివాదాలు చేసుకున్నారు. కానీ, ఇటీవ‌ల కాలంలో బ‌య‌ట ప‌డుతున్నారు.

ముఖ్యంగాప వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీల మ‌ధ్య అంత‌ర్యుద్ధ‌మే జ‌రు గుతోంద‌న్న‌ది వాస్త‌వం. ఇక ఇతర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. దీనిని గుర్తించ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. ఇలా బ‌హిరంగంగా.. కూట‌మి పార్టీలు క‌లిసే ఉన్నాయంటూ.. నొక్కి చెప్ప‌డం ద్వారా … తెర‌వెనుక ఏదో జ‌రుగుతోంద‌న్న వాద‌న‌ను స్వ‌యంగా ప‌వ‌న్ అంగీక‌రించిన‌ట్టు అవుతోంద‌ని అంటున్నా రు. ఇలాంటి విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతోపాటు.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం కూడా మెండుగా ఉంది. సో.. ఈ విష‌యంలో మున్ముందు బ‌హిరంగ వ్యాఖ్య‌ల కంటే.. అంత‌ర్గ‌త ప‌రిష్కారాలే మేల‌ని మేధావులు సూచిస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...