వరంగల్ బీఆర్ఎస్ సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని తరలించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు కొత్త రూల్స్ పెట్టారు.
బీఆర్ఎస్ సైనికులే వరంగల్ సభకు రావాలి అని తెలిపారు. 3వేల మంది కాకున్నా 1000 మంది అయినా చాలని కానీ కరుడుగట్టిన గులాబీ సైనికుడై ఉండాలి అని తెలిపారు. గతంలో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్లును తరలించాలనే యోచన చేయాలన్నారు.
భవిష్యత్తో మండల స్థాయి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవాళ్లు..పార్టీపై విపరీతమైన అభిమానం ఉన్నవాళ్లను మాత్రమే మహాసభకు తరలించాలన్నారు నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఫాంహౌజ్లో రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్య అతిథులుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరయ్యారు.
The post కేసీఆర్ ఆదేశాలు పాటించని మాజీ ఎమ్మెల్యే! appeared first on Adya News Telugu.