కేసీఆర్ సభ నుంచి వెళ్తుండగా ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి

Date:

Share post:


కేసీఆర్ సభ నుంచి వెళ్తుండగా ఘోర ప్రమాదం..ఇద్దరు మృతిన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆదివారం జరిగిన నేపథ్యంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి వెళ్తుండగా తుపాన్ వాహనం ఢీ కొని ఇద్దరు మృతి చెందారు. హుస్నాబాద్-సిద్ధిపేట మార్గంలో రాజ్ గోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన మేస్త్రీలు తాడేం సారయ్య, బండోజు గణేష్ మృతి చెందారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు. మేస్త్రీలు తాడేం సారయ్య, బండోజు గణేష్ మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇక అటు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వచ్చి మృతి చెందిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...