నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆదివారం జరిగిన నేపథ్యంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి వెళ్తుండగా తుపాన్ వాహనం ఢీ కొని ఇద్దరు మృతి చెందారు. హుస్నాబాద్-సిద్ధిపేట మార్గంలో రాజ్ గోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన మేస్త్రీలు తాడేం సారయ్య, బండోజు గణేష్ మృతి చెందారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు. మేస్త్రీలు తాడేం సారయ్య, బండోజు గణేష్ మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇక అటు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వచ్చి మృతి చెందిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.