తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆదిలాబాద్ జిల్లాలో రూ.3900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి… వెంకట్ రెడ్డి భోళా మనిషి, ఆయన ఎక్కడికైనా వెళ్లి పని చేయించుకుని రాగలరు అన్నారు.
కోమటిరెడ్డి మనసులో ఎలాంటి విద్వేషాలు ఉండవన్నారు. ఏది ఉన్నా ఓపెన్గా చెప్పే మనస్తత్వమని కొనియాడారు. బండి సంజయ్ నోట…కాంగ్రెస్ మంత్రిపై ప్రశంసలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వం ప్రధాని మోడీని, బీజేపీని తిట్టడం వల్ల తెలంగాణ వెనుకబడింది అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రాజీవ్ రహదారి కాంట్రాక్టర్ సమస్య పరిష్కరిస్తే దాని జాతీయ రహదారిగా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.
The post కోమటిరెడ్డి..భోళా మనిషి! appeared first on Adya News Telugu.