క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!

Date:

Share post:


క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!

నవాజుద్దీన్ సిద్దీకి త్వరలోనే తన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కోస్తావ్ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సినిమా మే 1, 2025న జీ5 లో ప్రీమియర్ కానుంది. సేజ్‌ల్ షా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

గోవాకు చెందిన ధైర్యవంతుడైన కస్టమ్స్ ఆఫీసర్ కోస్తావ్ ఫెర్నాండిస్ యొక్క నిజజీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. నవాజుద్దీన్ తో పాటు, ఈ చిత్రంలో ప్రియా బాపట్, కిశోర్ కుమార్ జి, హుస్సేన్ దలాల్, మరియు మహికా శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

కోస్తావ్ కు రచయితలు భవేశ్ మండలియా మరియు మేఘ్నా శ్రీవాస్తవ కాగా, నిర్మాతలు వినోద్ భాను‌శాలి, కమలేశ్ భాను‌శాలి, భవేశ్ మండలియా, సేజ్‌ల్ షా, శ్యామ్ సుందర్, మరియు ఫైజుద్దీన్ సిద్దీకి. నవాజుద్దీన్ చివరిసారిగా 2024లో వచ్చిన సూపర్‌నాచురల్ హారర్ చిత్రం అద్భుత్ లో కనిపించారు. కోస్తావ్‌తో పాటు నవాజుద్దీన్ ఆదిత్య సర్పోట్డార్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం థమా లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా, పరేశ్ రావల్, మరియు అపర్శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించనున్నారు. థమా అక్టోబర్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.

The post క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్! appeared first on Adya News Telugu.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...