నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా జరిపిన ఈ దాడిలో గడచిన 24 గంటల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. సుమారు 109 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. సెంట్రల్ గాజాలోని నుసెయిరాట్లోని ఓ భవనంపై ఇజ్రాయిల్ బాంబు దాడికి పాల్పడింది. ఈ దాడి వల్ల 8 మంది మృతి చెందారు. ఈ దాడిని నుసెయిరాట్ నివాసితులు భూకంపంగా అభివర్ణించారు. వరుస దాడులతో గాజా వణికిపోతోంది. పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పలుమార్లు ఇజ్రాయిల్ని హెచ్చరించినప్పటికీ పాలస్తీనియన్లకు ఆహార సరఫరాను కూడా ఇజ్రాయిల్ నిలిపివేస్తోంది.
The post గాజాపై ఇజ్రాయిల్ దాడి…39 మంది మృతి appeared first on Navatelangana.