సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వివిఆర్ స్కూల్ ఎదుట మంగళవారం రాత్రి కొత్తగూడెం నుండి బెంగళూరుకు వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొట్టడంతో మూడు పాడి గేదలు మృతి చెందాయని ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్యగూడెం గ్రామానికి చెందిన మన్నెం వెంకన్నకు చెందిన పాడి గేదెలుగా గుర్తించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గేదెలు మృతి చెందడం వల్ల తనకు సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు విలపించారు.