చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు

Date:

Share post:


రాష్ట్రంలోని మత్స్యకారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక భృతిని రెట్టింపు చేసింది. గతంలో ఈ భృతి రూ.10 వేల రూపాయలు ఉండగా…దానిని కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంచింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, వేట నిషేధ భృతిని రెట్టింపు చేశామని అన్నారు. పెంచిన భృతి మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని పవన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, అందుకోసం ప్రభుత్వం రూ. 259 కోట్లను కేటాయించిందని పవన్ వెల్లడించారు.

మత్స్యకారుల వలసలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, స్థానికంగా జాలర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందని, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు.

The post చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు first appeared on namasteandhra.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...