కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి.. ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా ఫ్రాంచైజీ తర్వాత.. ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కించి మరోసారి ఇండియన్ వైడ్గా తన సత్తా చాటుకున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సంచలన క్రియేట్ చేసి.. భారీ రికార్డులను కొల్లగొట్టాడు. ఇక ప్రస్తుతం నీల్.. ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మరోసారి ఈ సినిమాతో బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయాలని కసితో ఉన్నాడు చరణ్. ఈ సినిమా తర్వాత ప్రభాస్తో సలార్ 2 సినిమాను కూడా రూపొందించాల్సి ఉంది.
ఇక ఈ రెండు సినిమాలు పూర్తికాకముందే.. చరణ్తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం.. చరణ్తో సుభాష్ చంద్రబోస్ బయోపిక్ ను తీయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ స్టోరీ కాదంటే.. ఓ పీడిత ప్రాంతానికి సంబంధించిన ఫ్రిక్షన్ స్టోరీని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఈ రెండు కాన్సెప్ట్లలో ఏదైనా చరణ్ తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చరణ్కు రెండు స్టోరీలను వినిపించాడట. వాటిలో.. ఏది ఫైనల్ చేస్తే ఆ కథతో సినిమా చేయాలని నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఏదేమైనా పాన్ ఇండియా లెవెల్లో ఆయనకు ఉన్న క్రేజ్ రీత్యా.. స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ.. ప్రశాంత్ మాత్రం వరుసగా టాలీవుడ్ హీరోలకు అవకాశాలు ఇస్తుండడం విశేషం. కాగా ఇప్పటివరకు ప్రశాంత్ సాధించిన సక్సెస్ లన్నీ ఒక ఎత్తైతే.. ముందు ముందు చేయబోయే సినిమాలతో మరో రేంజ్ లో బ్లాక్ బస్టర్లు అందుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీని శాసించే రేంజ్ కు ప్రశాంత్ ఎదగాలని కోరుకుంటున్నారు.