సింహాచలం అప్పన్న ఆలయంలో గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటనపై ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ విమర్శలు చేశారు. దీంతో, జగన్ కు కౌంటర్ ఇస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ వైసీపీకి కాదు..రాబందుల పార్టీకి అధ్యక్షుంటూ నిమ్మల చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూడడం దారుణమని జగన్ పై నిమ్మల మండిపడ్డారు. వైసీపీ హయాంలో బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులు తప్ప ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రాజధాని రీస్టార్ట్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను, చేసిన త్యాగాన్ని రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గౌరవించేలా అమరావతి నిర్మాణం కొనసాగుతుందన్నారు. పాలకొల్లులో రూ.1.63 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా నిమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు.
The post జగన్ ను ఆ పక్షితో పోల్చిన మంత్రి first appeared on namasteandhra.