‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని హామీనిచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయంలో తమ వంతు పాత్ర పోషించిన వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తెస్తామని చెప్పారు.
జగన్ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బుకు లెక్కలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే జాలర్ల దశ దిశ మారిందని చెప్పారు. వేట విరామ సమయంలో జాలర్లకు ఆర్థిక సాయం చేస్తున్నామని, మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు.
‘గత నాయకుల మాదిరిగా మేము కూడా బటన్ నొక్కొచ్చు కానీ.. నేరుగా మీ దగ్గరికే వచ్చాం.. మీ సమస్యలు తెలుసుకున్నాం. మీ కష్టాలు తెలుసుకుని నేరుగా పథకాలు అందిస్తున్నాం’ అని జగన్ పై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి వస్తే వస్తే చెట్లు నరికేయడం.. పరదాలు కట్టడం జరిగేవని విమర్శించారు. ఏపీలో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని..ఏడాదిలోగా వాటి నిర్మాణం పూర్తి చేస్తామని హామీనిచ్చారు.
The post జగన్ లా బటన్ ఎందుకు నొక్కడం లేదో చెప్పిన చంద్రబాబు first appeared on namasteandhra.