ఢిల్లీని జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసులు.. 5వేల‌మంది పాక్ పౌరులు గుర్తింపు

Date:

Share post:


ఢిల్లీని జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసులు.. 5వేల‌మంది పాక్ పౌరులు గుర్తింపున‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జమ్మూ, కశ్మీర్ లోని పహల్గామ్ లో ఈ నెల 22న పాకిస్తాన్ టెర్రరిస్టులుచేసిన ఉగ్రదాడితో యావత్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. పర్యటకులే లక్ష్యంగా చేసుకొని అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండి పడటమే కాకుండా.. ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ పై ప‌లు దౌత్య‌ప‌ర‌మైన ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా ఆ దేశ పౌరులు గ‌డువులోపు ఇండియాను వ‌దిలి వెళ్లిపోవాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరుల‌ను గుర్తించి, ఆదేశ‌స్తుల‌ను పంపించి వేయాల‌ని, అందుకు త‌గ్గు చ‌ర్య‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చేప‌ట్టాల‌ని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో త‌నిఖీలు చేప‌ట్టిన అధికారులు.. 5వేల‌మంది పాక్ పౌరుల‌ను గుర్తించారు. ఫార‌న్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం అందించిన డేటాతో ప‌లు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేప‌ట్టారు. తెల్ల‌వారుజామును ప్ర‌త్యేక ద‌ళంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు..5వేల‌మంది పాక్ పౌరుల‌ను గుర్తించారు. త్వ‌రలోనే వారిని పాకిస్తాన్ పంపే ఏర్పాట్లు చేస్తామ‌ని అధికారులు తెలిపారు. శ‌నివారం గుజ‌రాత్‌లోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టిన అధికారులు పాకిస్థానీల‌తో పాటు బంగ్లాదేశ్ పౌరుల‌ను కూడా గుర్తించారు. అదే విధంగా హైద‌రాబాద్ లో కూడా దాయాది దేశ‌స్తుల‌ను పోలీసులు గుర్తించారు. గ‌డువులోపు పాక్ పౌరులు వెళ్లిపోవాల‌ని నోటీసులు ఇచ్చారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...