అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య చాలాకాలం బ్లాక్ బస్టర్ లేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చందు మొండేటి డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా చైతు కెరీర్లోనే భారీ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బిజీ అవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్లో.. చైతు నెక్స్ట్ మూవీ నటించిన సంగతి తెలిసిందే. మైథాలజికల్ థ్రిల్లర్గా ఈ సినిమా చైతు కెరీర్లోనే 24వ సినిమాగా రూపొందుతుంది. భారీ విఎఫ్ఎక్స్ తో ఆడియన్స్లో ఆసక్తి నెలకొల్పే కంటెంట్తో సినిమా తెరకెక్కనుందని చైతన్య తాజాగా ఇంటర్వ్యూలో వివరించాడు.
అదే ఇంటర్వ్యూ చైతన్య ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడాడు. చైతు గతంలో షోయో పేరుతో ఫుడ్ బిజినెస్ ని మొదలుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెస్టారెంట్ పై దేవర జపాన్ ప్రమోషన్స్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాగచైతన్య నడుపుతున్న షోయూ గురించి మాట్లాడి దాని గురించి మంచి రివ్యూ ఇచ్చాడు. దేవర జపాన్ ప్రమోషన్స్లో హైదరాబాద్లో ఉన్న ఫేవరెట్ రెస్టారెంట్ను జపనీస్ కోసం చెప్పమని ఎన్టీఆర్ యాంకర్ను ప్రశ్నించగా.. దానికి ఎన్టీఆర్ హైదరాబాద్ ఫుడ్ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్నేషనల్ ఫుడ్ దొరుకుతుంది అదే బాంబే, ఢిల్లీ, హైదరాబాద్. హైదరాబాద్లో జపనీస్ ఫుడ్ దొరికే బెస్ట్ ప్లేస్ ఒకటి ఉంది. అదే నా కోస్టార్ అయిన నాగచైతన్యది. అందులో సూషి చాలా బాగుంటుందంటూ షోయు గురించి నెక్స్ట్ లెవెల్ లో ఇలివేట్ చేశాడు తారక్. ఇక తాజాగా నాగచైతన్య.. తారక్ తన రెస్టారెంట్ గురించి మాట్లాడి అక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పిన వీడియోను చూసి.. ఆరోజు నాకెంతో ఆనందం కలిగిందని వివరించాడు. షోయు అనే రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన తనకు లాక్ డౌన్ టైం లో వచ్చిందని.. ఆలోచనతోనే రెస్టారెంట్ మొదలైందని.. ప్రజెంట్ ఆ హోటల్ చాలా బాగా రన్ అవుతుంది అంటూ చైతన్య వివరించాడు.