టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ కాన్సెప్ట్తో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందంటూ వార్తలు వినిపించినా.. బన్నీ, అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ, అట్లీ.. సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేసే ఛాన్స్ లేదు. ఇక ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి త్రివిక్రమ్ మరో మల్టీస్టారర్ను ప్లాన్ చేస్తున్నాడట. ధనుష్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి క్రమంలో నాని హిట్ 3 ప్రమోషన్స్లో భాగంగా త్రివిక్రమ్.. గతంలో మల్టీస్టారర్ను ప్లాన్ చేశారని.. మూవీలో నన్ను, వెంకటేష్ సర్ని హీరోలుగా భావించారని.. తర్వాత త్రివిక్రమ్ గారి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆయన నుంచి అప్డేట్ వస్తే వెంకీ సార్, నేను కలిసి నటించడానికి రెడీగా ఉన్నాం అంతా త్రివిక్రమ్గారి చేతుల్లో ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ నాని, వెంకీ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా వస్తే మాత్రం అది మోస్ట్ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలకు ఫ్యామిలీ ఆడియన్స్లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే.. ఆడియన్స్లోను మంచి అంచనాలు నెలకొంటాయి.
ఇక త్రివిక్రమ్ ఈ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువస్తాడో వేచి చూడాలి. ఇక నాని హిట్ 3 సినిమా మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే.. ప్యారడైజ్ సెట్స్లోకి నాని అడుగుపెట్టనున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ 26న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు వివరించారు. మార్చ్ 27న చరణ్ పెద్ది సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రెండు సినిమాల పోటీపై నాని రియాక్ట్ అయ్యారు. ముందుగా అనుకున్న ప్రకారమే నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిందని.. పెద్ది, పేరడైజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతాయని నేను నమ్ముతున్న అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం నాని.. త్రివిక్రమ్ కాంబోలో సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.