భారత్ వర్సెస్ పాక్.. వార్ కొనసాగుతున్న క్రమంలో భారతదేశ సక్సెస్కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భారత పౌరులు.. గొప్పగా చాటుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో స్వయంగా ఇండియన్ ఆర్మీ భారత పౌరులకు చిన్న విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ పని మాత్రం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ భారతదేశ ఆర్మీ ఇండియాని అంతగా విజ్ఞప్తి చేయాల్సిన ఆ పని ఏంటో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్యన భీకరమైన పోరు మొదలైంది. ఈ క్రమంలోనే భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కొన్ని మిస్సైల్స్ను భారత్ లోకి పంపినప్పటికీ వాటన్నింటినీ భారత సమయస్ఫూర్తిగా తిప్పికొట్టింది.
గగనతలంలోనే చిత్తుచిత్తుగా చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్న క్రమంలో.. ఇండియన్ ఆర్మీ భారత దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. అదేంటంటే.. ప్రియమైన భారతీయ పౌరులారా ప్రస్తుతం ఇండియన్.. పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో.. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవి ఆఫీసర్లకు సంబంధించిన విమానాలు, వాహనాలు, హెలికాప్టర్లు ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళుతున్న సమయంలో దయచేసి పౌరులు ఎవరు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీయవద్దంటూ రిక్వెస్ట్ చేసింది. ఒకవేళ వీడియోలు తీసిన వాటిని సోషల్ మీడియాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయవద్దు అంటూ పేర్కొంది.
ఒకవేళ అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అవి వైరలై మన శత్రుదేశానికి తెలిస్తే.. మనకు తెలియకుండానే పాకిస్తాన్కు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి.. ఈ పని మాత్రం చేయవద్దు అంటూ ఇండియన్ ఆర్మీ భారతదేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్మీ చేసిన ఈ ఆపిల్ను భారత పౌరులు స్వీకరించాలని.. భారత సైన్యానికి సహకరించాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కోసం ఎంతగానో పోరాడుతున్న మన సైనికుల కోసం.. వాళ్ళు చెప్పినట్లు విని.. ఫోటోలు, వీడియోలు తీయకుండా ఉండడం మంచిది. ప్రతి ఒక్క భారత పౌరుడు.. దీనిని పాటించడం వల్ల ఇండియాకు మనమే ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం.