దయచేసి ఆ పని చేయకండి.. భారత పౌరులకు ఇండియన్ ఆర్మీ విజ్ఞప్తి

Date:

Share post:


భారత్ వర్సెస్ పాక్.. వార్ కొనసాగుతున్న క్రమంలో భారతదేశ సక్సెస్‌కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భారత పౌరులు.. గొప్పగా చాటుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో స్వయంగా ఇండియన్ ఆర్మీ భారత పౌరులకు చిన్న విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ పని మాత్రం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ భారతదేశ ఆర్మీ ఇండియాని అంతగా విజ్ఞప్తి చేయాల్సిన ఆ పని ఏంటో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్యన భీకరమైన పోరు మొదలైంది. ఈ క్రమంలోనే భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కొన్ని మిస్సైల్స్‌ను భారత్ లోకి పంపినప్పటికీ వాటన్నింటినీ భారత సమయస్ఫూర్తిగా తిప్పికొట్టింది.

Despite Wars with Pakistan, When Did India Extend a Hand of Peace? A  Complete Historical Account | Despite Wars with Pakistan, When Did India  Extend a Hand of Peace? A Complete Historical

గగనతలంలోనే చిత్తుచిత్తుగా చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్న క్రమంలో.. ఇండియన్ ఆర్మీ భారత దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. అదేంటంటే.. ప్రియమైన భారతీయ పౌరులారా ప్రస్తుతం ఇండియన్.. పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో.. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవి ఆఫీసర్లకు సంబంధించిన విమానాలు, వాహనాలు, హెలికాప్టర్లు ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళుతున్న సమయంలో దయచేసి పౌరులు ఎవరు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీయవద్దంటూ రిక్వెస్ట్ చేసింది. ఒకవేళ వీడియోలు తీసిన వాటిని సోషల్ మీడియాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయవద్దు అంటూ పేర్కొంది.

Indian Army - Wikipedia

ఒకవేళ అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అవి వైరలై మన శత్రుదేశానికి తెలిస్తే.. మనకు తెలియకుండానే పాకిస్తాన్‌కు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి.. ఈ పని మాత్రం చేయవద్దు అంటూ ఇండియన్ ఆర్మీ భారతదేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్మీ చేసిన ఈ ఆపిల్ను భారత పౌరులు స్వీకరించాలని.. భారత సైన్యానికి సహకరించాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కోసం ఎంతగానో పోరాడుతున్న మన సైనికుల కోసం.. వాళ్ళు చెప్పినట్లు విని.. ఫోటోలు, వీడియోలు తీయకుండా ఉండడం మంచిది. ప్రతి ఒక్క భారత పౌరుడు.. దీనిని పాటించడం వల్ల ఇండియాకు మనమే ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...