దేవినేని ఉమ కుమారుడి పెళ్లికి సీఎం రేవంత్, లోకేశ్

Date:

Share post:


టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడు నిహార్‌ పెళ్లి వేడుక నేడు ఘనంగా జ‌రిగింది. ఈ క్రమంలోనే ఈ పెళ్లికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువ‌నేశ్వ‌రి, మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజీఐ ఎన్‌వీ ర‌మ‌ణ‌లతో పాటు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి తొలిసారి విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే రేవంత్‌కు హెలిప్యాడ్ వ‌ద్ద మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్‌, నిమ్మ‌ల రామానాయుడు, బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి ఘన స్వాగ‌తం ప‌లికారు. మంత్రి లోకేశ్‌, సీఎం రేవంత్ రెడ్డి క‌లిసి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరిద్దరూ సమకాలీన రాజకీయాలపై కాసేపు చర్చించుకున్నారని తెలుస్తోంది.

గతంలో టీడీపీ నేతగా కీలక బాధ్యతలు పోషించిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ సీఎంగా సమర్థవంతంగా పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ టీడీపీ నేత అయిన రేవంత్ కు పార్టీలో ఉమతో పాటు చాలామంది కీలక నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇక, మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ భావి సీఎం అని టీడీపీ నేతలు భావిస్తున్న నారా లోకేశ్…రేవంత్ రెడ్డిల కలయిక హాట్ టాపిక్ గా మారింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...