నీలంతోగు గుత్తి కోయ గూడెంకు క్యాన్లతో తాగునీరు సరఫరా 

Date:

Share post:


  • ఎంపీ ఓ జాల శ్రీధర్ రావు

నవతెలంగాణ -తాడ్వాయి 

మండలంలోని బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో దట్టమైన అడవి ప్రాంతంలో గల నీలంతోగు అనే గుత్తి కోయ గూడెం నికి మంగళవారం మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు మండల పంచాయతీ అధికారి (ఎంపిఓ) జాల శ్రీధర్ రావు 36 గుత్తి కోయ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు వాటర్ క్యాన్ల చొప్పున మొత్తం 72 మినరల్ వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. వాటర్ క్యాన్లు అయిపోగానే సమాచారం అందిస్తే వెంటనే ట్రాక్టర్ ద్వారా మళ్ళీ మినరల్ వాటర్ అందిస్తామని తెలిపారు. ఎండలు తీవ్రంగా కొడుతున్న సందర్భంగా అక్కడ నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంచినీటి సరఫరా మంచినీటి క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలియజేశారు. మంచినీటి సమస్య తీర్చినందుకు అక్కడి గుత్తి కోయ ఆదివాసీలు మహిళలు పిల్లలు అధికారులకు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఓ శ్రీధర్ రావు వెంట మేడారం పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సత్తీష్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...