నేడు అఖిలపక్ష సమావేశం.. – Navatelangana

Date:

Share post:


– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్‌తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరుగనున్నది. హోంమంట్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సైతం సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్‌ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది.. భవిష్యత్‌ సన్నాహాలపై కేంద్రం వివరాలను తెలియజేయనున్నది.
అయితే, ఏప్రిల్‌ 24న జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని ప్రధానమంత్రిని డిమాండ్‌ చేశామని.. కానీ ఆయన రాలేదని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. ఈసారైనా ప్రధాని రావాలని ఆయన కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ జాతీయ విధానం స్పష్టంగా, బలంగా ఉందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడుదేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. మే 13 నుంచి 17 వరకు నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలకు సంబంధించి స్థానిక దళాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...