పద్మ భూషణ్ అందుకున్న బాలకృష్ణ

Date:

Share post:


టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో విశేష సేవలందించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ హోదాలో ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఇటీవలే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.

ఈ క్రమంలోనే నేడు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును బాలకృష్ణ అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ ను బాలయ్య గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ‘‘ఈ శుభవార్తను వినేందుకు నా తండ్రి జీవించి ఉంటే బాగుండుదనిపిస్తోంది. ఆయన ఎంతో గర్వపడేవారు’’ అని బాలయ్య బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సతీమణి వసుంధర, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, అల్లుడు భరత్ పాల్గొన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...