టాలీవుడ్ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా మరోవైపు ఎన్నికలకు ముందు తాను కమిట్ అయిన సినిమాలను చకచక పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇందులో పవన్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఉంది. దీంతో పవన్ అభిమానులు ఎప్పటినుండో చూస్తున్న ఓజీ కూడా ఒకటి.సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి చేయడానికి పవన్ డేట్స్ కూడా ఇచ్చారట.
అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్లోనే ఉంది. తమిళ సూపర్ హిట్ థేరి (2016) కి రీమేక్గా ఈ సినిమా వస్తుండగా ఈ మూవీ కోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట పవన్. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా రూ. 170 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట పవన్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ రెమ్యునరేషన్ వార్త మాత్రం టీ టౌన్లో వైరల్గా మారింది. 2026 సమ్మర్లో ఉస్తాద్ భగత్సింగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
The post పవన్ రెమ్యునరేషన్..షాకింగ్ న్యూస్? appeared first on Adya News Telugu.