పాకిస్తాన్ ను సపోర్ట్ చేసిన భారత మహిళకు మెగా కోడలు దిమ్మతిరిగే కౌంటర్..!

Date:

Share post:


ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి.. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ఆ ఉగ్రవాద ముఠాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాలలో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర విద్యార్థుల సైతం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులపై నిరసనలు తెలియజేస్తున్నారు. ఉగ్రవాదం నశించాలి.. భరతమాతకు జై అంటూ వీధుల్లో మారుమోగిపోయే నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Pahalgam attack: ಉಗ್ರರ ಅಟ್ಟಹಾಸ; ಮತ್ತೊಂದು ಭಯಾನಕ ವಿಡಿಯೋ ವೈರಲ್!

అంతేకాదు.. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్‌ను డిమాండ్ చేస్తూ వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. ముంబై బెంగళూరు చెన్నై లాంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహా నిరసనలు కొనసాగుతున్న క్రమంలో.. సోషల్ మీడియాలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. # Pahalgam attack # India against terrorism లాంటి ట్యాగ్‌లతో.. తమ బాధను కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మతం, ప్రాంతం, భాష అని సంబంధం లేకుండా భారతీయులంతా ఒకే తాటిపై ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. ఈ సంఘీభావం దేశ ఐక్యతను చాటుతుంది. ఇలాంటి క్రమంలోనూ మన దేశంలో ఉన్న కొందరు పాకిస్థాన్‌కు మద్దతు తెలపడం సంచలనంగా మారుతుంది.

New Pahalgam attack video shows tourists in a huddle as gunshots echo in meadow

ప్రజలు పాకిస్తాన్ జాతీయ జెండాలని రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ నిరసన తెలియజేస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతీ రోడ్లపై అంటించిన పాకిస్తాన్ జెండాను తొలగించి కాళ్లతో తొక్కనివ్వకుండా అడ్డుపడింది. దీంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మర్యాదగా పాకిస్తాన్ జెండాను రోడ్డుపై అంటించమని కోరారు. కానీ.. ఆమె దానికి నిరాకరించింది. పాక్ జెండాని రోడ్డుపై నుంచి ఎందుకు తీసావు.. పాకిస్తాన్ కు నువ్వు మద్దతిస్తున్నావా అంటూ స్థానికులు ఆమెను ప్రశ్నిస్తూనే.. తిరిగి పాక్ జెండాను రోడ్డుపై వేయాలని లేదంటే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ను షేర్ చేస్తామంటూ వివరించారు.

అయినా ఆ యువతి నిరాకరించడంతో దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో పై మెగా కోడలు లావణ్య త్రిపాటి స్పందించింది. మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి దేశాన్ని రక్షిస్తుంటే ఈ దేశానికి హాని కలిగించే వారికి కొంద‌రు మద్దతు ఇస్తున్నారు. ఇది చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. దేశం లోపాల నుంచి శుద్ధి చేయాల్సిన సమయం ఇది అంటూ తన పోస్ట్‌లో వెల్లడించింది. ప్రస్తుతం లావణ్య పోస్ట్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిని ఉద్దేశించి సరైన కౌంటర్ వేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.





Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...