పాక్‌ పౌరులకు వీసా సేవలు రద్దు

Date:

Share post:


– Advertisement –

పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడికి పాల్పడిన వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలను రద్దు చేసింది కేంద్రం. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో క్యాబినెట్ భద్రతా కమిటీ తీసుకున్న నిర్ణయాల అనుసరణగా, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపిస్తున్నట్లు తెలిపింది.

2025 ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు ఇప్పటి వరకు జారీ చేసిన అన్ని వీసాలు అన్ని రద్దు చేసింది. వైద్య అవసరాల కోసం జారీ చేసిన వీసాలు మాత్రం 2025 ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి అని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు తమ వీసా గడువు ముగిసేలోపు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాలి అని తెలిపింది.

భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించకూడదు. ఇప్పటికే పాకిస్తాన్‌లో ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా దేశానికి తిరిగి రావాలని సలహా ఇస్తున్నాం అని తెలిపింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...