నవతెలంగాణ-హైదరాబాద్: భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి పాతబస్తీలోని యాకుత్పురా, సంతోష్నగర్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి షర్ఫోన్తోపాటు మున్వర్ఖాన్, ఖదీర్ ఉన్నిస్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మహేశ్వరంలో వంద ఎకరాల భూమిని కబ్జా చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఇండ్లతోపాటు కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ అమోరు కుమార్ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్లో ఫర్హోన్ ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతున్నారు. ఆయనకు నగరంలో పలుచోట్ల భారీ షోరూమ్లు ఉన్నాయి. ఐఎఎస్ అమోరుకుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే సర్వే నంబర్లోని ప్రైవేట్ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోరుకుమార్కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిజ నిర్థారణ చేయడానికి ఈడీ చర్యలు చేపట్టింది