పాతబస్తీలో ఈడీ అధికారుల తనిఖీలు

Date:

Share post:


పాతబస్తీలో ఈడీ అధికారుల తనిఖీలున‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూదాన్‌ భూముల వ్యవహారానికి సంబంధించి పాతబస్తీలోని యాకుత్‌పురా, సంతోష్‌నగర్‌లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి షర్ఫోన్‌తోపాటు మున్వర్‌ఖాన్‌, ఖదీర్‌ ఉన్నిస్‌ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేస్తున్నారు. మహేశ్వరంలో వంద ఎకరాల భూమిని కబ్జా చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఇండ్లతోపాటు కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్‌ అమోరు కుమార్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌లో ఫర్హోన్‌ ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతున్నారు. ఆయనకు నగరంలో పలుచోట్ల భారీ షోరూమ్‌లు ఉన్నాయి. ఐఎఎస్‌ అమోరుకుమార్‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పిగ్లీపూర్‌ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్‌లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే సర్వే నంబర్‌లోని ప్రైవేట్‌ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్‌ యాదవ్‌ వెంచర్‌ వేసి సీలింగ్‌ ల్యాండ్‌ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్‌ యాదవ్‌ వెంచర్‌ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్‌ అమోరుకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిజ నిర్థారణ చేయడానికి ఈడీ చర్యలు చేపట్టింది



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...