– Advertisement –
నవతెలంగాణ-పెద్దవూర
భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవా తత్పరుడు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న స్మరించుకున్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన అల్లూరి గారి ధైర్యసహసాలను కీర్తించారు.బ్రతుకుతెరువు కోసం భారతదేశానికి వచ్చి భారతీయులను బానిసలుగా మార్చిన తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజును మనమందరం స్మరించు కుందామని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న అన్నారు.
– Advertisement –