మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోషన్ రాబోతోంది. ఈ జంట తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకబోతున్నారు. ప్రస్తుతం లావణ్య ప్రెగ్నెంట్ గా ఉంది. ఈ విషయాన్ని తాజాగా వరుణ్ తేజ్ కన్ఫామ్ చేశాడు. మరి కొద్ది రోజుల్లోనే తమ బేబీ రాబోతుందని ఇరువురు ఇన్స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ను అందరితోనూ పంచుకున్నారు.
`లైఫ్ లో అత్యంత అందమైన రోల్ పోషించనున్నారు.. కమింగ్ సూన్` అనే క్యాప్షన్ తో వరుణ్ తేజ్, లావణ్య ఓ ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేశారు. అందులో వీరిద్దరూ బేబీ షూస్ తో ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని కనిపించారు. ఇక అఫీషియల్ గా ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు సినీ సెలబ్రిటీలు, స్నేహితులు, అభిమానులు కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు.
కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో వరుణ్-లావణ్య జంట కూడా ఒకటి. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పై `మిస్టర్`, `అంతరిక్షం` వంటి చిత్రాల్లో నటించారు. సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించడంతో.. పెళ్లికి మార్గం సుగమం అయింది. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ ఇప్పుడు తన 15వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మెర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. మరోవైపు లావణ్య త్రిపాఠి `సతీ లీలావతి` అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది.
View this post on Instagram
The post పేరెంట్స్ గా ప్రమోషన్.. గుడ్న్యూస్ చెప్పిన వరుణ్ – లావణ్య! first appeared on namasteandhra.