ప్రజా భద్రత కోసమే కమ్యూనిటీ పోలీసింగ్ 

Date:

Share post:


– Advertisement –

తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి 
: ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నామని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొండాలతోగు గుత్తి కోయ గూడెంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించి, వారిని ఉద్దేశించి మాట్లాడారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగడానికి ముందే దాని నిరోధించడం దాని ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ వాడకం, మద్యం సేవించకుండా సీట్ బెల్ట్ ధరించి వేగం లాంటి అనేక భద్రత పాటిస్తూ వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలు జరగవని ఆయన సూచించారు. అలాగే బాల్యం వివాహాలు, పిల్లలు భవిష్యత్తును నాశనం చేస్తాయని, అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని అన్నారు. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో నేరాలు, ప్రమాదాల నియంత్రణకు సీసీ కెమెరాల ఆవశ్యకతను, సైబర్ నేరాలు పట్ల అవగాహన అవసరం అని వివరించారు. కార్యక్రమంలో పోలీసులు పూజారి రమేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...