ప్ర‌ధాని మోడీపై ఎంపి జైరాం రమేష్ సెటైర్లు

Date:

Share post:


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పహల్గాం ఉగ్రదాడిపై అఖిల పక్ష సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌ మండిపడ్డారు. రాబోయే బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీకి సమయం ఉంది, కానీ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు సమయం లేదని ఎద్దేవా చేశారు. బాధ్యత వహించాల్సి సమయంలో ప్రధాని మోడీ ‘గాయబ్‌’ (మాయమయ్యారు) అంటూ ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ఏప్రిల్‌ 22న అఖిల పక్షం నిర్వహించాలని డిమాండ్‌ చేశామని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చారు కానీ, బీహార్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని అన్నారు. ప్రధానికి బీహార్‌ ఎన్నికల పచారంలో ప్రసంగించేందుకు సమయం ఉంది కాని అఖిలపక్ష సమావేశంలో ప్రసంగించేందుకు సమయం లేదని అన్నారు. పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌ నిర్వహించాలని, దీనిలో అంశంపై రాజకీయ ఎజెండా లేదని అన్నారు. మనమంతా ఐక్యంగా ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి, ఐక్యంగా ఉండాల్సిన సమయమిదని అన్నారు.

The post ప్ర‌ధాని మోడీపై ఎంపి జైరాం రమేష్ సెటైర్లు appeared first on Navatelangana.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...