PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

బడ్జెట్ నుంచి ఆశిస్తున్న 5 ప్రధాన వరాలివి, నిర్మలమ్మ కరుణిస్తే సామాన్యుడికి పండగే


Budget 2023: వచ్చే ఏడాది (2024) సార్వత్రిక ఎన్నికల ముందు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్. 2023 ఫిబ్రవరి 1వ తేదీన, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె ఎదుట, దేశ ప్రజల అంచనాలు పర్వతమంత ఎత్తున పేరుకుపోయాయి. బడ్జెట్ 2023 ద్వారా దేశ పౌరులకు ఎంత మేర ఉపశమనం కలిగించగరన్నది ప్రధాని నరేంద్ర మోదీ ముందున్న పెద్ద సవాల్‌.

మొదటి ఆశ – ఆదాయ పన్ను రేట్లు
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈసారి బడ్జెట్‌లో జీతగాళ్ల వర్గానికి పన్ను స్లాబ్‌ను సవరించాలి, ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలి. మినహాయింపు పొందే కొత్త పన్ను విధానాన్ని అవలంబించడం మినహా 2016-17 నుంచి ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్నులో 30 శాతం, 25 శాతం పన్ను శ్లాబ్‌లకు కొంత మినహాయింపు ఇస్తారని ఈ ఏడాది అంచనాలు ఉన్నాయి.

5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును ప్రభుత్వం కల్పించాలని, తద్వారా సామాన్య పన్ను చెల్లింపుదార్లకు కొంత ఊరట లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఇది కాకుండా, సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం రూ. 3 లక్షలుగా ఉన్న పన్ను రహిత ఆదాయాన్ని రూ.7.5 లక్షల వరకు పెంచాలన్న డిమాండ్‌ కూడా ఉంది.

రెండో ఆశ – ఈక్విటీ LTCGపై పన్ను రహిత పరిమితి పెంపు
ఒక ఆర్థిక సంవత్సరంలో, షేర్ల విక్రయం ద్వారా రూ. 1 లక్ష కంటే ఎక్కువ లాభం పొందితే, దాని మీద దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను చెల్లించాలి. ఈ కేటగిరీ 2004 వరకు పూర్తిగా పన్ను రహితంగా ఉంది. ఎందుకంటే, ఇది భద్రత లావాదేవీల పన్నుకి (STT) లోబడి ఉంటుంది. ఇప్పుడు, దీనిని రద్దు చేస్తారన్న ఆశ చాలా తక్కువగా ఉంది. అయితే, షేర్ల విక్రయం మీద పన్ను విధించని పరిమితిని రూ. 1 లక్షకు బదులుగా రూ. 2 లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు.

మూడో ఆశ – రైల్వే బడ్జెట్ కింద మరో 400 వందే భారత్ రైళ్ల డిమాండ్
గత బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వచ్చే 3 సంవత్సరాలలో 400 సెమీ హై స్పీడ్ నెక్ట్స్‌ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను సమర్పించారు. ఈ ఏడాది భారతదేశంలో వందేభారత్ రైళ్లు కాకుండా, మరో 400 రైళ్లను తీసుకురావడానికి ప్రకటన రావచ్చని చెప్పుకుంటున్నారు. రానున్న కాలంలో.. రాజధాని, శతాబ్ది వంటి రైళ్ల పేర్లతో సహా అన్ని హై స్పీడ్ రైళ్లను మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఈ రైళ్లకు ఆర్థిక మంత్రి మరికొంత నిధులు కేటాయించాలని ఆశిస్తున్నారు.

నాలుగో ఆశ – స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలి
2023 బడ్జెట్‌లో, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50,000 నుంచి రూ. లక్షకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం దృష్ట్యా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరో రూ. 50,000 పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ కేటగిరీని సవరించాలన్న డిమాండ్‌ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంది. దానిని రూ. 1 లక్షకు పెంచితే, సాధారణ ప్రజలకు మంచి ఉపశమనం లభిస్తుంది.

ఐదో ఆశ – గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 (B) ప్రకారం, పన్ను చెల్లింపుదారులు గృహ రుణంపై చెల్లించే వడ్డీ మీద రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పన్ను మినహాయింపు పరిమితి కూడా పెంచాలనే డిమాండ్ ఉంది. పెరిగిన వడ్డీ రేట్లు, పెరుగుతున్న ప్రాపర్టీ ధరల మధ్య ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *