యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామానికి చెందిన జిట్టా అయిలయ్య,గీతలకు చెందిన సుమారు 50 గొర్రెలు కుక్కల దాడిలో మరణించాయి.ఈ విషయం తెలుసుకొని మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో రూ.50 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వ
విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం,వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం ఆధ్వర్యంలో అందజేశారు.క్యామ మల్లేశం సొంతగా మరో రూ.10 వేలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.