భార‌త్ దెబ్బ‌కు అబ్బా అంటున్న పాక్‌..!

Date:

Share post:


పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని భార‌త ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడి వెనుక పాకిస్థాన్ ఉంద‌ని తేల‌డంతో ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు దారుణంగా దిగ‌జారాయి. పాక్ పై క‌న్నెర చేసిన భార‌త ప్ర‌భుత్వం.. ఆ దేశానికి వ్య‌తిరేకంగా ప‌లు క‌ఠిన చ‌ర్య‌లు చేపడుతోంది. ఆర్థిక, వ్యాపార మార్గాల్లో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ అబ్బా అనేలా భార‌త్ మ‌రో దెబ్బ కొట్టింది.

పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధిస్తూ భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తున్నట్లు శుక్ర‌వారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం త‌క్ష‌ణ‌మే అమలులోకి తెచ్చింది. మేడిన్ పాకిస్థాన్ వస్తువులకు ఇక‌పై ఇండియాలో చోటులేదని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

పాకిస్థాన్ మూలం ఉన్న లేదా అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువైనా సరే ఇండియాలోకి అనుమతించబోమ‌ని.. ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న ఉత్పత్తులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. కాగా, మ‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత దాయాది పాకిస్తాన్ పై ప్ర‌తీకారంగా భార‌త ప్ర‌భుత్వం సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. భార‌త్‌లో ఉన్న పాక్‌ పౌరులు తిరిగి పంపించింది. అలాగే పాకిస్థాన్ దేశానికి చెందిన విమానాలు మన గగనతలంలోకి రాకుండా చర్యలు చేపట్టింది. తాజాగా మేడిన్ పాక్ వస్తువులకు భార‌త్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఈ నిషేధంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

The post భార‌త్ దెబ్బ‌కు అబ్బా అంటున్న పాక్‌..! first appeared on namasteandhra.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...