మహేష్‌కు ఫ్రెండ్‌గా ఆ స్టార్ హీరోనా.. జక్కన్న ప్లాన్‌కి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!

Date:

Share post:


టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్‌ సినిమాగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కనున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుక్కుమారన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా మరో కీలక పాత్రలో కనిపించనుంది.

ఇక ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న టీం.. ఇప్పటికే రెండు స్కెడ్యూలను పూర్తి చేశారు. మిగతా ప్రాజెక్టులు కూడా వేగంగా పూర్తి చేసి.. ఎలాగైనా 2027 కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబుకు బెస్ట్ ఫ్రెండ్ గా ఓ కీలకమైన పాత్ర ఉండనుందని.. ఆ క్యారెక్టర్ లో పాన్ ఇండియా లెవెల్ లోనే క్రేజీ పాపులారిటీ దక్కించుకున్న ఓ స్టార్ హీరోను జక్కన్న సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ.. న్యూస్ తెగ‌ వైరల్‌గా మారుతుంది.

అయితే ఇంతకీ ఆ క్యారెక్టర్‌లో నటించనున్న‌ స్టార్ హీరో ఎవరు అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు జక్కన్న. ఇక‌ ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు నటించడం లేదని.. ఇతర భాషల నుంచి కొద్దిమంది యంగ్ హీరోలను తీసుకునే ప్రయత్నంలో జక్కన్న ఉన్నాడని టాక్. ఇక సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటించనున్న ఈ క్యారెక్టర్‌కి కూడా మంచి గుర్తింపు వస్తుందని.. సినిమా మొదటి నుంచి చివరి వరకు మహేష్ తో కలిసి ఆ రోల్ ట్రావెల్ కానుందని.. ఎమోషనల్ ఎలివేషన్స్ బ్యాలెన్స్ చేసే ఎఫెక్టివ్ క్యారెక్టర్ కూడా అదే అని స‌మాచారం.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...