PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మీరు మెచ్చే మీకు నచ్చే కార్లతో ఇండియా ఆటో ఎక్స్ పో మార్ట్ 2023 రెడీ


భారతదేశపు అతిపెద్ద ఆటో ఎక్స్ పో ప్రారంభమైంది. ఈ 16వ ఆటో ఎక్స్ పో నేటి నుంచి 2023 జనవరి 11 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనుంది. దీనితో పాటు, ఆటో ఎక్స్ పో యొక్క కాంపోనెంట్ షో ప్రగతి మైదానంలో జరుగుతోంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఈ పెద్ద మెగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్‌పోను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అదే సమయంలో, వారాంతాల్లో దీని సమయం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. చివరి రోజు అంటే జనవరి 18 న, సాధారణ ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శించగలరు. 

రోడ్డు, మెట్రోలో ప్రయాణించి ఇండియా ఎక్స్ పో మార్ట్ 2023కి చేరుకోవచ్చు. ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి విమానంలో వచ్చిన వారైతే… ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో రైలులో వస్తున్నట్లయితే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 41 కిలోమీటర్లు ప్రయాణించి ఆటో ఎక్స్ పో 2023కు చేరుకోవచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెట్రో ద్వారా నేరుగా ఆటో ఎక్స్పోకు చేరుకోవచ్చు. నోయిడా సెక్టార్ 51కి వచ్చే ప్రజలు ఆక్వా లైన్ మెట్రో ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఢిల్లీ మెట్రో మొబైల్ యాప్ సాయం తీసుకోవచ్చు.

ప్రవేశ టిక్కెట్

మీరు ఈ మెగా ఆటో ఎక్స్ పో 2023 కు వెళ్లాలనుకుంటే టిక్కెట్లు కొనాల్సి ఉంటుంది. జనవరి 13వ తేదీకి రూ.750, జనవరి 14, 15 తేదీల్లో రూ.475గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ తేదీల్లో కాకుండా 15వ తేదీ తర్వాత సందర్శించడానికి వస్తే టికెట్కు రూ.350 మాత్రమే ఖర్చు చేయాలి. అదే సమయంలో ఈ ఆటో ఎక్స్ పోలో ఐదేళ్ల వరకు పిల్లలకు టిక్కెట్లు ఉండవు. ఆటో ఎక్స్ పో 2023 టిక్కెట్లను కొనుగోలు చేయడానికి, మీరు బుక్ మై షో అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ డౌన్‌లోడ్‌ చేసుకొని నేరుగా ఆన్ లైన్ లో టికెట్ పొందవచ్చు. ఒక టికెట్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *