మృగశిర కార్తె ఎఫెక్ట్.. చేపలకు ఎగబడిన జనం..

Date:

Share post:


– Advertisement –

అందిన కాడికి దోసుకున్న వ్యాపారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
: ఆదివారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో జనం చేపలకు ఎగబడ్డారు. ఇదే అదునుగా భావించిన మత్స్య వ్యాపారులు అందినకాడికి దండుకున్నారు. సాధారణంగా కిలో చేపలు రూ.100 నుంచి రూ.150 వరకు ఉంది. కానీ మృగశిర రోజున ప్రజలు ఎలాగైనా చేపల రుచి చూస్తారనే నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకే వ్యాపారులు మండలంలోని తాడిచెర్ల, మల్లారం, కొయ్యుర్ తదితర గ్రామాల్లోకి చేరుకొని కిలో చేపలు రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయించారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మృగశిర రోజున తప్పకుండా చేపల పులుసు రుచి చూడాలి కాబట్టి వ్యాపారులు చెప్పిన ధరకు కొనుగోలు చేయక తప్పకపోవడంతో ప్రజలకు కిలో రూ.100 అదనంగా జేబుకు చిల్లు పడింది. సాయంత్రం వరకు ధర తగ్గకపోద్దా..కొందరు పేదలకు అసలుకే ఎసరు అన్నట్టుగా చేపలు కొరత ఏర్పడటంతో చేపల పులుసు రుచి చూడని పరిస్థితి ఏర్పడింది.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...