యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో గుర్తు తెలియని బాలిక (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ప్రాంతంలో పడి ఉన్న బాలిక(10) మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాలిక ఎవరు? ఎలా చనిపోయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.