ఐపీఎల్ 2025లో అద్భుతం జరిగింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్…35 బంతుల్లోనే సెంచరీ చేసి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 11 సిక్స్లు 7 ఫోర్లతో 101 పరుగులు చేసిన వైభవ్.. గుజరాత్ బౌలర్లకు పీడకలనే మిగిల్చాడు.
ఐపీఎల్తో పాటు టీ20ల్లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ వైభవ్దే.
యశస్వి జైస్వాల్ 70 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 32 పరుగులు చేశారు. ఆరంభం నుండే గుజరాత్ బౌలర్లలో విరుచుకపడటంతో 15.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కొల్పోయి 212 పరుగులు చేసింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కొల్పోయి 209 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 39 పరుగులు చేయగా శుభ్మన్ గిల్ 54, బట్లర్ 50 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది.
ఈ సెంచరీ చేయడం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. ఐపీఎల్లో ఇది తనకు ఫస్ట్ సెంచరీ అని, మూడవ ఇన్నింగ్స్ అని చెప్పాడు. ఐపీఎల్కు ముందు చాలా సాధన చేశానని, దీంతో ఆ రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతున్నాయని వైభవ్ అన్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేయడం తన కల అని తెలిపాడు. ఇప్పుడది నెరవేరిందని అన్నాడు. తాను పూర్తిగా గేమ్పైనే దృష్టి పెడతానని తెలిపాడు.
The post వైభవ్ విధ్వంసం…సిక్సర్ల మోతతో సెంచరీ appeared first on Adya News Telugu.