అక్కినేని వారి కోడలు, నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డ చైతూ.. గత ఏడాది డిసెంబర్ లో ఆమెను వివాహం చేసుకున్నాడు. శోభిత వచ్చిన వేళా విశేషమో ఏమో కానీ `తండేల్` రూపంలో చైతూకు బిగ్ హిట్ పడింది. ప్రస్తుతం సక్సెస్ జ్యోష్లో ఉన్న ఈయన.. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించాడు.
అదే విధంగా ఫ్యామిలీ లైఫ్కి ప్రాధాన్యత ఇస్తూ భార్య శోభితతో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ జంట వేవ్స్ 2025 ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో శోభిత వదులుగా ఉండే చీర కట్టులో మెరిసింది. ఆమె వస్త్ర శైలిని గమనించిన కొందరు నెటిజన్లు.. శోభిత గర్భవతి అని, నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడని నెట్టింట ప్రచారం షురూ చేశారు.

అక్కినేని అభిమానులు కూడా ఈ ప్రచారం నిజమేమో అని నమ్ముతున్న నేపథ్యంలో శోభిత ప్రెగ్నెన్సీపై తాజాగా ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. `శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. ఆమె ప్రెగ్నెంట్ అనే న్యూస్ నిజం కాదు. ప్రస్తుతం శోభిత తన మ్యారేజ్ లైఫ్ ను ఆస్వాదిస్తోంది. మాతృత్వంపై ఇంతవరకు ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ` అంటూ టీమ్ పేర్కొంది. దీంతో పుకార్లకు పులిస్టాప్ పడింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ దండుతో నాగచైతన్య ఓ భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. `ఎన్సీ 24` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం ప్రారంభమైంది. చైతూ కెరీర్ లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇక శోభిత చివరిగా బాలీవుడ్ మూవీ `లవ్ సితార`లో మెరిసింది. వివాహం అనంతరం ఆమె మరో చిత్రం చేయలేదు. కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి ప్రకటనలూ రాలేదు. మరి మ్యారేజ్ తర్వాత శోభిత గ్యాప్ తీసుకుందో.. లేక వచ్చిందో తెలియాల్సి ఉంది.